
ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఇచ్చోడ మండలం ముఖరా (కే ) గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. వారితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు.